Tharun Bhascker Press Meet about His Talk Show `NEEKU MAATHRAME CHEPTHA`

Tharun Bhascker Press Meet about His Talk Show `NEEKU MAATHRAME CHEPTHA`

 

“నీకు మాత్రమే చెప్తా” టాక్ షో ద్వారా నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకున్నా-తరుణ్ భాస్కర్

పి.పి ప్రొడక్షన్ లో తరుణ్ భాస్కర్ హోస్ట్ చేస్తోన్న టాక్ షో ‘‘నీకు మాత్రమే చెప్తా’’. ప్రజా ప్రభాకర్, శ్రీకాంత్ ఈ కార్యక్రమానికి నిర్మాతలు. శరత్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ మొదటి ఎపిసోడ్ మార్చి 14 నుండి ఓ టీవీ చానెల్ లో ప్రసారమవుతుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిర్మాతలు ప్రభాకర్, శ్రీకాంత్, తరుణ్ భాస్కర్, శరత్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నిర్మాత ప్రజా ప్రభాకర్ మాట్లాడుతూ…
ఒక సినిమా వెనక ఎన్ని కష్టాలు ఉన్నాయి,? ఒక డైరెక్టర్ వెనక ఎంత కష్టం ఉంటుంది ? అనేది ఈ షో లో చూపించడం జరిగింది. ఈ కాన్సెప్ట్ చెప్పగానే ఒప్పుకున్న తరుణ్ భాస్కర్ గారికి ధన్యవాదాలు. మార్చి 14 నుండి నీకు మాత్రమే చెప్తా మొదలుకాబోతొంది.  డైరెక్టర్ అవ్వకముందు తాను పడిన కష్టాలు ఈ ప్రోగ్రామ్ లో ఎంటర్టైన్ విధానంలో చెప్పడం జరిగిందని తెలిపారు.

డైరెక్టర్ శరత్ మాట్లాడుతూ…
ప్రొడ్యూసర్ శ్రీకాంత్ గారు ఒకరోజు ఈ కాన్సెప్ట్ చెప్పి డైరెక్ట్ చెయ్యమన్నారు. నన్ను నమ్మి ఈ ప్రోగ్రామ్ నాతో డైరెక్ట్ చేయించినందుకు థాంక్స్. షూట్ సమయంలో తరుణ్ భాస్కర్ గారు బాగా ఎంకరేజ్ చేశారు. నా డైరెక్షన్ టీమ్ బాగా సపోర్ట్ చేసింది, వారందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను అన్నారు.

తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ…
నన్ను ఆదరిస్తూ వస్తున్న వారందరికోసం మరో కొత్త ప్రయత్నంతో మీ ముందుకు వస్తున్నాను. ఒక డైరెక్టర్ మరో డైరెక్టర్ ను ఇంటర్వ్యూ చెయ్యడం అనే కాన్సెప్ట్ కొత్తగా అనిపించింది. టెలివిజన్ లో ప్రోగ్రామ్ చెయ్యడంతో చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాను. శనివారం నుండి ప్రసారం కాబోతున్న ‘‘నీకు మాత్రమే చెప్తా’’ షో నన్ను చాలా మార్చింది, ఈ షో ప్రభావం మీ మీద కూడా ఉంటుందని అనుకుంటున్నాను. నాకు ఇతర డైరెక్టర్ల మీద ఉన్న అభిప్రాయాలు చాలా వరకు మారాయి. నిర్మాతలు శ్రీకాంత్, ప్రభాకర్ గారు ఈ కాన్సెప్ట్ తో మా దగ్గరికి రావడం నాకు నచ్చడంతో ఈ షో వెంటనే స్టార్ట్ చేశాము, ఇది ఫస్ట్ సీజన్, ఇప్పటివరకు కొన్ని ఎపిసోడ్స్ షూట్ చేశాము. సక్సెస్ ఫుల్ డైరెక్టర్స్ తో పాటు రీసెంట్ గా విజయాలందుకున్న కొత్త దర్శకులను కూడా ఈ ప్రోగ్రామ్ లో పరిచయం చేయబోతున్నాము.  నేను వెంకటేష్ గారితో చేయబోయే ప్రాజెక్ట్ త్వరలోనే మొదలవుతుంది.సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాణంలో తెరకెక్కుతుంది. నేను నెట్ ఫ్లిక్స్ కి చేసిన వెబ్ సిిరీస్ చాలా బాగా వచ్చింది.మంచు లక్ష్మి గారు ఓ ఇంపార్టెంట్ రోల్ చేశారు.ఈ సిరీస్ తో మేఘనా శాన్వి అనే కొత్తమ్మాయి ఇంట్రడ్యూస్ అవుతుంది.తను చాలా బాగా చేసింది. త్వరలోనే ఈ వెబ్ సిరీస్ స్ట్రీమ్ అవుతుంది.నేను ఔట్ పుట్ తో చాలా హ్యాపీగా ఉన్నాను అని తెలిపారు.