‘ఉనికి’ మూవీ న్యూస్ !!

‘ఉనికి’ మూవీ న్యూస్ !!

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఆశిష్ గాంధీ, చిత్ర శుక్ల కాంబినేషన్లో ఎవర్ గ్రీన్ ఎంటర్ టైన్ మెంట్స్ చిత్రం ‘ఉనికి’

‘నాటకం’ ఫేమ్ ఆశిష్ గాంధీ, ‘రంగుల రాట్నం’ ఫేమ్ చిత్ర శుక్ల కాంబినేషన్ లో రాజకుమార్ బాబీ దర్శకత్వంలో ఎవర్ గ్రీన్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకం పై బాబీ ఏడిద, రాజేష్ బొబ్బూరి నిర్మిస్తున్న చిత్రం ‘ఉనికి’. ప్రస్తుతం ఈ సినిమా సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

ఈ సందర్భంగా నిర్మాతలు బాబీ ఏడిద ,రాజేష్ బొబ్బూరి మాట్లాడుతూ- ‘’ ఈ ప్రపంచంలో ఏ మనిషైనా తన ఉనికి చాటుకోవడం కోసం తపిస్తాడు. ముఖ్యంగా అననుకూల పరిస్థితులు, అడ్డంకులు, అవరోధాలు ఎదురైనప్పుడు ఇంకా ఎక్కువగా ఉనికి కోసం తాపిస్తారు. ఓ సామాన్య మధ్య తరగతి యువతికి అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు తన ఉనికి నిలుపు కోవడం కోసం ఎలా పోరాడింది అనేది ఈ చిత్రం ప్రధాన కథాంశం. రాజమండ్రి సబ్-కలెక్టర్ అంజలి అనుపమ ని చూసినప్పుడు కలిగిన ఆలోచనతో ఈ స్క్రిప్ట్ తయారు చేయడం జరిగింది. అలాగని ఇదేమి ఆమె రియల్ స్టోరీ కాదు. ఇందులో ప్రతి సన్నివేశం కొత్తగాను, ఆశక్తికరంగాను అనిపిస్తుంది. ఈ రోజుతో చిత్రీకరణ మొత్తం పూర్తైయింది. 45 రోజుల పాటు రెండు schedules లో చిత్రీకరించాం. ఉభయ గోదావరి జిల్లాలోని అందమైన ప్రాంతాల్లో షూటింగ్ చేశాం. ఇందులో మొత్తం మూడు పాటలున్నాయి అని తెలిపారు.

టీఎన్ఆర్’’,’రంగస్థలం’ నాగ మహేష్ , అప్పాజీ అంబరీష, ప్రభావతి, టిక్ టాక్ దుర్గా రావు, పద్మశ్రీ, , బండి స్టార్ కిరణ్, మల్లేది రవి తదితరులు ఈ చిత్ర ప్రధాన తారాగణం.
ఈ చిత్రానికి కథ: బాబీ ఏడిద, రచన: సరదా శ్యామ్, ఛాయాగ్రహణం-కూర్పు: హరి కృష్ణ, సంగీతం: పి. ఆర్ (పెద్దపల్లి రోహిత్), సహనిర్మాత: అడ్డాల రాజేష్, నిర్మాత‌లు: బాబీ ఏడిద‌, రాజేష్ బొబ్బూరి, ద‌ర్శ‌క‌త్వం: రాజ్‌కుమార్