తెలుగు పరిశ్రమకు ముఖ్యమంత్రి కేసీఆర్ వరాల జల్లు కురిపించారు: ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్

తెలుగు పరిశ్రమకు ముఖ్యమంత్రి కేసీఆర్ వరాల జల్లు కురిపించారు: ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్

తెలుగు పరిశ్రమకు ముఖ్యమంత్రి కేసీఆర్ వరాల జల్లు కురిపించారు: ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్  

సినిమా థియేటర్లు రీఓపెనింగ్‌ చేసుకునేలా జీవో ఇవ్వడంతో పాటు సినీ ఇండస్ట్రీకి లాభం చేకూర్చేలా పలు నిర్ణయాలు ప్రకటించినందుకు తెలంగాణ సీఎం కేసీఆర్‌కు తెలుగు ఇండస్ట్రీ తరపున తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి ధన్యవాదాలు తెలిపింది. చిన్న సినిమాలకు జీఎస్టీ రీయింబర్స్‌మెంట్ ఇచ్చినందుకు.. థియేటర్లు ఇష్టప్రకారం షోలు పెంచుకునేందుకు.. సినిమా టికెట్ల ధరను మార్పులు చేస్తూ పెంచుకునే వీలును కలిగిస్తూ  పలు నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా సినీ కార్మికులకు రేషన్, హెల్త్ కార్డులు ఇస్తామని హామీ ఇచ్చారు. ముక్యంగా 1500 ఎకరాల్లో సినిమా ఇండస్ట్రీ కి ఇస్తున్నట్టు ప్రకటించిన సందర్బంగా తెలుగు సినిమా యావత్ పరిశ్రమ ఆయనకు కృతజ్ఞతలు తెలిపింది. నిర్మాతల మండలి, మా అసోసియేషన్, దర్శకుల సమాఖ్య ఇలా సినిమాకు సంబందించిన 24 క్రాఫ్ట్స్ సమక్షంలో మంగళవారం ఫిలిం ఛాంబర్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసారు.

ఈ కార్యక్రమంలో సౌత్ ఇండియ ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షులు, నిర్మాత సి కళ్యాణ్ మాట్లాడుతు .. ఈ రోజు సినిమా ఇండస్ట్రీ కి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మేనిఫెస్టో ఇచ్చారు. నిజానికి ఇది జి ఎచ్ ఎం సి మేనిఫెస్ట్ లో అనౌన్స్ చేసినప్పటికీ ఇది సినిమా ఇండస్ట్రీ మేనిఫెస్టో. ఎన్ శంకర్ గారు మొదట ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకెళ్లారు. అప్పుడే అయన 2000 ఎకరాల్లో సినిమా ఇండస్ట్రీ ఎలా ఉండాలో చెప్పారు కేసీఆర్ గారు. ఆ తరువాత కొన్ని రోజులకు చిరంజీవి గారు, నాగార్జున గారు, తెలుగు ఫిలిం ఛాంబర్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ , ఇండస్ట్రీ తరపున శ్రీనివాస్ యాదవ్ గారు ఏంతో కృషి చేసి ముఖ్యమంత్రి గారితో మాట్లాడారు.. అయన రెండు గంటలపాటు మాతో మాట్లాడడం నిజంగా మాకే షాక్ కలిగించింది. ఒక ముఖ్యమంత్రి అంత సేపు మాట్లాడడం అన్నది ఎక్కడ జరిగి ఉండదు. కానీ అయన అంతసేపు పరిశ్రమకు సంబందించిన విషయాలు తెలుసుకున్నారు. కరోనా సమయంలో థియేటర్స్ తెరిచేంత వరకు కూడా కరెంట్ బిల్లులను మినిమం చార్జీలు కూడా లేకుండా చేయడం. రెండు నెలలు మూడు నెలలు కాకుండా ఎప్పుడు థియేటర్స్ తెరిస్తే అప్పడి వరకు ఆ వేసులు బాటు కల్పించారు. అలాగే పెద్ద సినిమాకు ఎంత ఉపయోగమో, చిన్న సినిమాకు అంతే ఉపయోగం. ఇక్కడ చిన్న సినిమా, పెద్ద సినిమా అనేది లేదు. అంతా ఒక్కటే, అందరికి సమానంగా అవకాశం ఉంటుంది. అలాగే షోస్ పెంచుకోవడానికి అవకాశం ఇవ్వడం, టికెట్స్ రేట్ విషయంలో నచ్చిన తీరుగా పెంచుకునే అవకాశం కల్పించారు. దానికి తోడు టికెట్ రీఎంబర్స్మెంట్ కలిగించడం మంచి పరిణామం. వెస్ట్ బెంగాల్ లో ఈ రీఎంబర్స్ మెంట్ ఉంది .. అయితే అది ప్రేక్షకుడికి అందుతుంది .. కానీ ఇక్కడ నిర్మాతకు  అందేలా చేస్తున్నారు. అది చిన్న నిర్మాతలకు చాలా హెల్ప్ అవుతుంది .. దానిద్వారా చాలా సినిమాలు మొదలవుతాయి. అలా మొదలయితే ఎంతమందికో పని దొరికి కృష్ణానగర్ కళకళలాడుతుంది. సినిమా ఇండస్ట్రీ కి సంబందించిన పనులన్నీ కూడా సింగిల్ విండో ద్వారా చేయడమని చెప్పారు. దాని ద్వారా పనులన్నీ తొందరగా పూర్తవుతాయని నమ్మకం ఉంది. ఫిలిం ఇండస్ట్రీ కి ఇన్ని వరాలు ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని సినిమా ఇండస్ట్రీ తరపున అన్ని క్రాఫ్ట్స్ కలిసి పెద్ద కార్యక్రమం నిర్వహించి ఆయనను గ్రాండ్ గా సన్మానించుకుంటాం. ఇక్కడ రెండు రాష్ట్రాలు ఏర్పడి సినిమా ఇండస్ట్రీ కి ఇద్దరు తండ్రులు అయిపోయారు ..కాబట్టి ఇదే వేదికపై ఆంధ్రా సీఎం ని కూడా పిలిచి సన్మానించుకుంటాం. ఆంధ్రా సీఎంతో కూడా సినిమా ఇండస్ట్రీ అభివృద్ధికి కావలసిన పనులు అడుగుతాం తప్పకుండా అయన సపోర్ట్ అందిస్తారని కోరుకుంటున్నాం అన్నారు.

తెలంగాణ స్టేట్ ఛాంబర్ ప్రసిడెంట్ మురళి మోహన్ మాట్లాడుతూ ..  అపర భగీరధుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అయన ఏ విషయంలోనైనా కులంకుశంగా తెలుసుకున్న తరువాతే దానిగురించి నిర్ణయం తీసుకుంటారు. సినిమా పరిశ్రమ విషయంలో కూడా అన్ని విషయాలు స్టడీ చేసి ఇండస్ట్రీ కోసం చాలా కోరికలు నెరవేర్చినందుకు అయనకు ధన్యవాదాలు తెలుపుతున్నాను అన్నారు.

మా అసోసియేషన్ సెక్రెటరీ జీవిత రాజశేఖర్ మాట్లాడుతూ .. సినిమా పరిశ్రమ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎన్నో వరాలు ఇచ్చారు. నిజంగా అయన పరిశ్రమ కోసం ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు ఆయనకు నా ప్రత్యేక కృతఙ్ఞతలు తెలుపుకుంటున్నాం, తప్పకుండా కేసీఆర్ గారు చెప్పింది చేస్తారు, ఆయనకు మా అసోసియేషన్ తరపున స్పెషల్ థాంక్స్ అన్నారు.

ఫిలిం ఫెడరేషన్ ప్రసిడెంట్ కొమరం వెంకటేష్ .. ఈ రోజు నాకు 24 క్రాఫ్ట్ కు సంబందించి చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్బంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి, అలాగే చిరంజీవిగారు, నాగార్జున గారికి స్పెషల్ థాంక్స్ చెబుతున్నాను. ఈ మద్యే వాళ్ళు అందరిని పిలిచి సినిమా పరిశ్రమలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఫెడరేషన్ లో ఎలాంటి సమస్యలు ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. వాటిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అలాగే ఇంకో ముఖ్య విషయం చెప్పాలి ఏమిటంటే .. ఇల్లు లేని కార్మికులు చాలా మంది ఉన్నారు, షూటింగ్ సరిగా లేకుండా రెంటు కట్టుకోలేక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు, అలాంటి  వాళ్ళకోసం ఇల్లు కట్టిస్తే బాగుటుంది అని కోరుకుంటున్నాను అన్నారు.

ప్రముఖ నిర్మాత సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ .. ముఖ్యమంత్రి గారు డైనమిక్ గా అన్ని ఇచ్చేసారు .. అలాగే ఇంకా ఏమైనా సమస్యలు ఉంటె వాటిని చెప్పండి అని అడిగారు .. ఇప్పుడు ఫెడరేషన్ వాళ్ళు చెప్పినట్టు కార్మికుల కోసం ఇల్లు కూడా వచ్చే ఏర్పాటు చేస్తాం. సినిమా ఇండస్ట్రీ కోసం ఇన్ని చేసిన డైనమిక్ ముఖ్యమంత్రి ఒక్క కేసీఆర్ గారే అన్నారు.  

ప్రముఖ దర్శకుడు ఎన్ శంకర్ మాట్లాడుతూ ..  సినిమా ఇండస్ట్రీ కోసం దాదాపు ఏడాది కాలంగా ముఖ్యమంత్రి గారితో చర్చలు జరుగుతూనే ఉన్నాయి. సినిమా ఇండస్ట్రీ, చిన్న నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్, ఇలా అన్ని విషయాలపై డిస్కషన్ జరుగుతున్నాయి. చిరంజీవి గారు, నాగార్జున గారు ముఖ్యమంత్రి తో మాట్లాడారు. నిజానికి ఇవి ఎప్పుడో కావాల్సింది .. కరోనా వల్ల ఆలస్యం అయింది. అయినా సరే జి ఎచ్ ఎం సి మేనిఫెస్టో లో సినిమా ఇండస్ట్రీ కి సంబంధించి పలు సమస్యలు సాల్వ్ చేసారు. చిన్న నిర్మాతలకు టికెట్ రీఎంబర్స్ చేయడం నిజంగా చాలా మంచి పరిణామం, అలాగే పెద్ద సినిమాలకు ఎక్కువ షోస్ వేసే వేళుసుబాటు కల్పించారు. నిజంగా ఈ నిర్ణయాలు చిన్న, పెద్ద నిర్మాతలకు ఆనందం కలిగించే విషయం. అలాగే సినిమా టికెట్స్ విషయంలో కూడా అవసరాన్ని బట్టి పెంచుకునే వీలును కలిగించారు. హైద్రాబాద్ ని ఫిలిం సిటీ హబ్  గా మార్చే ప్రయత్నంలో భాగంగా కేసీఆర్ గారు చాలా మంచి నిర్ణయాలు ఇండస్ట్రీ కోసం తీసుకున్నందుకు అయన సినిమా పరిశ్రమ తరపున కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం అన్నారు.

ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ విజయేందర్ రెడ్డి మాట్లాడుతూ  .. కేసీఆర్ గారి అపాయింట్ మెంట్ దొరికి ఆయనకు మన సమస్యలు ..చెప్పుకునే అవకాశం దొరికింది,  సినిమా వాళ్ళవే కావు ఏ ఇండస్ట్రీ అయినా సరే అయన వెంటనే దానికి తగ్గ ఫలితాన్ని ఇస్తారు. చిరంజీవి, నాగార్జున గారి ద్వారా ముఖ్యమంత్రికి మన సమస్యలు తెలియడం అయన పలు సమస్యలకు పరిష్కారం ఇవ్వడం  పరిశ్రమకు మంచి జరిగింది. ఈ సందర్బంగా కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను.

తెలుగు ఫిలిం ఛాంబర్ వైస్ ప్రెసిడెంట్ రామకృష్ణ మాట్లాడుతూ ..ఈ రోజు పరిశ్రమకు ఇన్ని వరాలు ఇచ్చిన కేసీఆర్ గారికి థాంక్స్ అన్నారు.

ఫిలిం ఫెడరేషన్ సెక్రెటరీ దొరై మాట్లాడుతూ … మా వర్కర్స్ కి కేసీఆర్ ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంది. గత ఐదేళ్లుగా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిద్వారా మా సమస్యలు చెప్పుకున్నప్పుడు ముఖ్యమంత్రి గారు ఎప్పుడు స్పందిస్తూ ఉన్నారు. ఈ మద్యే చిరంజీవిగారు, నాగార్జున గారి ద్వారా మా సమస్యలు ముఖ్యమంత్రి గారికి తెలియచేశాం. అయన మెడికల్ సమస్యలు, రేషన్ కార్డు సమస్యలను కూడా తీర్చినందుకు ఆయనకు మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను అన్నారు.

ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రెటరీ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ .. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఓ వేడుకలో చిరంజీవి, నాగార్జున గారిని పిలిచి ఇండస్ట్రీ గురించి తెలుసుకుని, మీకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి, నేను  ఏమి చేయాలి అని అడిగిన గొప్ప ఒక్క మగాడు కేసీఆర్. ఇప్పటికే చాలా చేసిన కేసీఆర్ గారు .. ఇప్పుడు జి ఎచ్ ఎం సి ఎన్నికల సందర్బంగా పవర్ ఇస్యూస్ పై క్లారిటీ ఇచ్చి, థియటర్స్ విషయంలో ఎప్పుడైనా ఓపెన్ చేసుకునే వీలు కల్పించారు. అలాగే టికెస్ విషయంలో మీకు అనువైన రేటు పెంచుకునే వీలును కల్పించారు. చిన్న సినిమాలకు టికెట్ రీఎంబర్స్మెంట్ ఇవ్వడం అన్నది గొప్ప విషయం .. ఈ సందర్బంగా ఆయనకు ప్రత్యేక థాంక్స్ చెబుతున్నాం .. ముక్యంగా చిరంజీవి, నాగార్జున గార్లకే కాదు అందరు హీరోలు, నటినటులు, ఇండస్ట్రీ కి సంబందించిన ప్రతి ఒక్కరికి థాంక్స్ చెబుతున్నాను.  అలాగే కేటీఆర్ గారికి, టూరిజం మినిష్టర్ శ్రీనివాస్ గౌడ్ గారికి, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి అధికారులకు అందరికి థాంక్స్ చెబుతున్నాను అన్నారు.

తెలుగు ఫిలిం ఇండస్ట్రీ జాయింట్ సెక్రెటరీ భరత్ మాట్లాడుతూ .. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ తరపున కేసీఆర్ గారికి ప్రత్యేక థాంక్స్ తెలుపుతున్నాం. కరోనా సమయంలో ఇండస్ట్రీ అయోమయంలో పడింది. ఈ సమయంలో ఏమి చేద్దామని టెన్షన్ పడుతున్న సమయంలో కెకెయిర్ గారి గారు వారలు ఇవ్వసాదం నిజంగా గొప్ప విషయం, అలాగే ఆంధ్రా సీఎం కూడా ఇలాగే పరిశ్రమకు మరిన్ని అవకాశాలు ఇస్తారని కోరుకుంటున్నాన్రు అన్నారు.

నిర్మాత దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ .. థియేటర్స్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చారు .. అయితే థియటర్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తాం, ఎలా ఓపెన్ చేస్తాం అన్నది మేము మాట్లాడి నిర్ణయం తీసుకోవాలి, ఆంధ్రా తో పాటు తెలంగాణ లో కూడా ఒకే రోజు ఓపెన్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. అసలు డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఏమి సమస్యలు ఉన్నాయి, నిర్మాతల సమస్యలు ఇలా అన్ని డిపార్టెమ్నెట్ కలిసి మాట్లాడుకుని థియేటర్స్ ఎప్పుడు తెరుస్తాం అన్నది ప్రకటిస్తాం .. అయితే ఇప్పటి వరకు తీయిట్రెస్ ఓపెన్ ఇప్పుడు అప్పుడు అంటూ వస్తున్నా పుకార్లను నమ్మొద్దని చెబుతున్నాను, ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నా అన్ని కార్యక్రమాలు కూడా పరిశ్రమలోని అందరికి ఉపయోగపడుతుంది అన్నారు.  
ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత , డిస్ట్రిబ్యూటర్ సునీల్ నారంగ్ తదితరులు పాల్గొన్నారు. ,    

 ఇచ్చినందుకు తెలుగు సినీ నిర్మాతల మండలి నుంచి ప్రెసిడెంట్ సి.కల్యాణ్, సెక్రటరీలు పసన్నకుమార్, మోహన్ వడ్లపట్ల.. సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం నుంచి ఈ నిర్ణయం వెలువడేందుకు తీవ్రంగా కృషి చేసిన హీరో మెగాస్టార్ చిరంజీవి, హీరో నాగార్జునకు కృతజ్జతలు తెలిపారు. అలాగే సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, ఇతర డిపార్ట్‌మెంట్స్‌కు ధన్యవాదాలు తెలియజేశారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.