Pasupulet`s Sridevi katha book launching on march 20th

Pasupulet`s Sridevi katha book launching on march 20th

ఈ నెల 20న అతిలోక సుంద‌రి `శ్రీదేవి క‌థ` పుస్త‌కావిష్క‌ర‌ణ‌!!

ప్ర‌ముఖ సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ ప‌సుపులేటి రామారావు తాజాగా రాసిన అతిలోక సుంద‌రి `శ్రీదేవి క‌థ‌` పుస్త‌కాన్ని యువ‌క‌ళావాహిని వారి ఆధ్వ‌ర్యంలో ఈ నెల 20వ తేదీ బుధ‌వారం ఉద‌యం 9.30 గంట‌ల‌కు ప్ర‌సాద్ ల్యాబ్స్ లో ఆవిష్క‌రించ‌బ‌డును. ఈ కార్య‌క్ర‌మానికి సుప్ర‌సిద్ధ న‌టి ర‌కుల్ ప్రీత్ సింగ్ తో పాటు ప‌లువురు సినీ ప్ర‌ముఖులు కూడా హాజ‌రుకానున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి అంద‌రూ ఆహ్యానితులే.
ఈ సంద‌ర్భంగా ప‌సుపులేటి రామారావు మాట్లాడుతూ…“ఈ పుస్త‌కంలో ఇంత వ‌ర‌కు చూడ‌ని ఫొటోల‌తో పాటు ఆమె గురించి చ‌ద‌వ‌ని అనేక అంశాలు పొందుప‌ర‌చ‌బ‌డ్డాయి. `సుమారు మూడు వంద‌ల పేజీలు క‌లిగిన ` శ్రీదేవి క‌థ‌` పుస్త‌కం అన్ని వ‌ర్గాల పాఠ‌కుల‌ను ఆక‌ట్టుకునే విధంగా అలంక‌రించ‌బ‌డింది“ అన్నారు.