“మిస్టర్ క్యూ” మెస్మరైజ్ చేస్తాడా?

“మిస్టర్ క్యూ” మెస్మరైజ్ చేస్తాడా?

     “మిస్టర్ క్యూ” మెస్మరైజ్ చేస్తాడా?

 లక్ష్మీ దామోదర క్రియేషన్స్ పతాకంపై స్వీయ నిర్మాణంలో బహుముఖ ప్రతిభాశాలి ‘శివాజీ కారోతి’ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘మిస్టర్ క్యూ”. వినూత్నమైన కథాoశంతో క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రైజింగ్ స్టార్ రాజ్ బాల హీరోగా నటిస్తుండగా… స్వాతి, త్రివేణి హీరోయిన్లు. జూ. నరేష్, సుధీర్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ‘మిస్టర్ క్యూ’ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.
     దర్శకనిర్మాత శివాజీ కారోతి మాట్లాడుతూ.. “ఇదొక విభిన్నమైన కథాచిత్రం. క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్స్ ఎంజాయ్ చేసేవాళ్లకు విపరీతంగా నచ్చుతుంది. ముఖ్యంగా ఈ చిత్రం మా హీరో ‘రాజ్ బాల’కు మంచి బ్రేక్ ఇస్తుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా దాదాపుగా పూర్తయ్యాయి. త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాము” అన్నారు.
     ఈ చిత్రానికి సంగీతం: పద్మనాభ భరద్వాజ్, ఎడిటింగ్: సెల్వ,, కెమెరా: కళ్యాణ్ సమి, మాటలు-స్క్రీన్ ప్లే: చలపతి పువ్వల, రచన-నిర్మాణం-దర్శకత్వం: శివాజీ కారోతి!!